ePaper
Tuesday, June 2, 2026
spot_img
ePaper
Homeహెల్త్భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన

📰 Generate e-Paper Clip

విశాలజ్యోతి డెస్క్: భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ వడదెబ్బతో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ కండె వెంకన్న(42) అనే వ్యక్తి మరణించారు. ప్రభుత్వ ఆసుపత్రి నిబంధనల ప్రకారం మరణించిన వారిని ప్రభుత్వ అంబులెన్స్‌లో ఇంటికి పంపించాల్సి ఉన్నా, ఆసుపత్రి సిబ్బంది వెంకన్నను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వలేదు. దీంతో వెంకన్న కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనం మాట్లాడుకునే స్తోమత లేక, మృతదేహాన్ని భుజాలపై మోస్తూ ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.!

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!