విశాలజ్యోతి: అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర మహిళ కమిటీ ఉపాధ్యక్షులుగా శ్రీమతి గుంటోజు పావని నిరంజన్ చారి గారిని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమతి గుంటోజు పావని నిరంజన్ చారి గారు ఎన్నో సంవత్సరాలుగా సంఘ సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, ఆపదలో ఉన్న ఎంతోమందికి సహాయ సహకారాలు అందించి మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. వారు మరింతగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించాలని భావించి ఈ సముచితమైన బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. తన నియామకం పట్ల కమిటీకి పావని కృతజ్ఞతలు తెలిపారు.


