VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 5:47 am Posted by : DK MEDIA

పోస్టాఫీసుల్లో భారీ మార్పు

సెప్టెంబరు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమలు.

బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్డ్ పోస్టు విధానాన్ని తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేయబోతోంది. ఈ విధానం సెప్టెంబరు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారులకు అత్యంత వేగవంతమైన, మెరుగైన సేవల్ని అందించడం, ట్రాకింగ్ విధానాన్ని సులభతరం చేయడం, అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తేవాలని తపాలా శాఖ నిర్ణయించింది. ఆమేరకు దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్ల పరిధిలోని మెయిల్ ఆపరేషన్ డివిజన్లకు ఆదేశాలు అందాయి.