సోనియా గాంధీకి అస్వస్థత…ఆస్పత్రిలో చికిత్స
విశాలజ్యోతి డెస్క్: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆమెను హుటాహుటిన గురుగామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.