• ట్రామా కేర్ ప్రాథమిక హక్కే….
విశాలజ్యోతి డెస్క్: Supreme Court of India కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రామా కేర్ ఇకపై ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా ‘112’ హెల్ప్లైన్ ప్రారంభించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రమాద సమయాల్లో ప్రతి నిమిషం విలువైనదని, వైద్యం ఆలస్యమైతే ప్రాణాలకే ముప్పు ఉంటుందని వ్యాఖ్యానించింది. త్వరితగతిన స్పందించడమే అసలైన మందు అని పేర్కొంది. ఆస్పత్రులు తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని ధర్మాసనం సూచించింది. ప్రమాద బాధితులకు సహాయం చేసేవారిపై పోలీసుల వేధింపులు ఉండకూడదని స్పష్టం చేసింది. కేంద్రానికి మూడు నెలల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు.