దుబాసి నవీన్కు చల్లా ధర్మారెడ్డి శుభాకాంక్షలు
విశాలజ్యోతి: దామెర మండల సర్పంచుల పోరం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ దుబాసి నవీన్తో పాటు పలువురు సర్పంచులు,గురువారం హన్మకొండలోని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, దుబాసి నవీన్కు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.