VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 8:45 pm Posted by : DK MEDIA

తొర్రూరులో కలకలం…

• భారీగా నిషేధిత నల్లబెల్లం, పట్టిక పట్టివేత…

విశాలజ్యోతి

తొర్రూరు శివారు పాల కేంద్రం వద్ద తొర్రూరు పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా తిరుమలగిరి నుండి తొర్రూర్ వస్తున్న తెల్లని స్విఫ్ట్ GJ 05 JB 0969 కారు అనుమానాస్పదంగా అనిపించడంతో కారు తనిఖీ చేయగా 8.50 క్వింటాళ్ల నల్ల బెల్లం,50 కేజీల పట్టిక లభ్యమైంది. జాకర్ గణపత్, తండ్రి: హనుమాన్ రాం, వయసు: 32 సం,,లు. కేకర్ గ్రామం మరియు మండలం, భార్మేర్ జిల్లా, రాజస్థాన్ స్టేట్ అని చెబుతూ, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశతో అతను ఒక కారు కొనుకొని దానిలో ప్రభుత్వము నిషేధించిన నల్ల బెల్లం, పట్టికని కర్ణాటక స్టేట్ లోని బీదర్ దగ్గర కొని తాను డోర్నకల్ గ్రామ చుట్టూ పక్కల వున్న తాండాలలో అమ్ముతున్నట్లు ఎస్ఐ మహేందర్ రెడ్డి తెలిపారు. వీటి విలువ మొత్తం రూ.93,000.దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు పోలీస్ లు తెలిపారు.