• కన్నెత్తి చూడని అధికారులు
విశాలజ్యోతి: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గోదావరి ఇసుక దందా జోరుగా సాగుతుంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఇసుక కావాలంటే ఒక ట్రాక్టర్ ధర రూ.8వేలు విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే భయాందోళనకు గురవుతున్నారు. కనీసం రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.